కరోనాకి మందు కనిపెడితే కోటి.. జాకీచాన్ బిగ్ ఆఫర్

ప్రపంచ దేశాలని భయపెడుతూ చైనాని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు అక్కడ వుహాన్ సిటీ పూర్తీగా ఖాళీ అయిపొయింది.

ఈ వైరస్ కారణంగా ప్రభుత్వం ఆ సిటీలో ప్రజలని వేరే ప్రాంతాలకి తరలించారు.

ఈ బయో వెపన్ నుంచి తమని తాము రక్షించుకోవడానికి ఇప్పుడు చైనా పెద్ద యుద్ధమే చేస్తుంది.

చైనా ప్రభుత్వం హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించి వైరస్ వ్యాప్తి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంది.

దీంతో ఇది వేగంగా విస్తరించకుండా ఆపగలుగుతున్నారు.అయిన కూడా ఈ వైరస్ రోగుల నుంచి కనీస ఇద్దరు నుంచి ముగ్గురికి ప్రతి రోజు వ్యాపిస్తుందే ఉంది.

ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఆ దేశం వ్యాపార దిగ్గజాలు తమకి తోచిన సాయం చేస్తున్నారు.

అందరూ ముందుకి వస్తూ పెద్ద మొత్తంలో విరాళంగా ఇస్తున్నారు.తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీ చాన్ సైతం కరోనా వైరస్‌పై స్పందించారు.

ఇప్పటికే పెద్ద మొత్తంలో మాస్క్‌లు, ఇతర సామాగ్రిని విరాళంగా ఇచ్చిన జాకీ మరో కీలక ప్రకటన చేశారు.

కరోనాకు మందు కనిపెట్టిన వారికి కోటి రూపాయిలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు.ప్రపంచంలో అన్ని దేశాలు ఇప్పటికే కరోనాకి మందు కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాయి.

ఈ నేపధ్యంలో వారిని మరింత ఉత్సాహ పరిచేందుకు జాకీచాన్ ఈ ఆఫర్ ప్రకటించాడు.

మరి ముందుగా ఈ కరోనాకి ఏ దేశం మందు కనిపెడుతుంది అనేది వేచి చూడాలి.

నువ్వా మాకు నీతులు చెప్పేది.. శ్యామలపై పవన్ ఫ్యాన్స్ దారుణమైన ట్రోల్స్ వైరల్!