ఏపీ సీఎస్ ను కలవనున్న జేఏసీ అమరావతి నేతలు
TeluguStop.com
ఏపీ జేఏసీ నేతలు సీఎస్ జవహర్ రెడ్డిని కలవనున్నారు.ఈ మేరకు మధ్యాహ్నం 3.
15 గంటలకు సీఎస్ తో భేటీ కానున్నారు.జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీసును సీఎస్ కు అందించనున్నారు.
మార్చి 9 నుంచి దశలవారీగా జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.కాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యలపై ఉద్యమ కార్యాచరణకు ఏపీ జేఏసీ అమరావతి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఏపీ రెవెన్యూ భవన్లో సమావేశమైన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.