మేము పొలిటికల్ కమెడియన్స్ కాదు.. ప్రొఫెషనల్ కమెడియన్స్.. ఆది షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
జనసేన క్యాంపెయినర్( Janasena Campaigner ) గా పలువురు జబర్దస్త్ కమెడియన్స్( Jabardasth Comedians ) ఎన్నికైన అనంతరం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే కమెడియన్ హైపర్ ఆది ( Hyper Aadi ) గత మూడు రోజుల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు.
ఇలా పిఠాపురంలో(Pitapuram) ని పలు మండలాలలో పర్యటన చేస్తున్నటువంటి హైపర్ ఆది అధికార ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
"""/"/
ఇటీవల పిఠాపురం( Pithapuram )లో పర్యటించిన ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ అధికార పక్ష నేతలపై విమర్శలు చేశారు.పిఠాపురంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గారికి మంచి స్పందన వస్తుందని ఆయన లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని తెలియజేశారు.
ముఖ్యంగా పిఠాపురం టిడిపి నేతగా ఉన్నటువంటి వర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని తెలిపారు.
గత కొంతకాలంగా ఈ నియోజకవర్గ ప్రజలతో ఎంతో మంచి అనుబంధము ఉన్నటువంటి వర్మ గారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేయడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు.
"""/"/
ఇక మీడియా వారు ఆదిని ప్రశ్నిస్తూ జబర్దస్త్ కమెడియన్ల చేత ప్రచారాలు చేయిస్తున్నారు అంటున్నారు కదా వాటిపై మీ స్పందన ఏంటి అనే ప్రశ్న కూడా ఎదురయింది.
ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ మేము ప్రొఫెషనల్ గా కమెడియన్స్ అండి వారిలాగా పొలిటికల్ కమెడియన్స్( Political Comedians )కాదు మేము అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
ప్రస్తుతం ఆది చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.కేవలం పిఠాపురంలో మాత్రమే కాకుండా జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా హైపర్ ఆది ప్రచార కార్యక్రమాలను నిర్వహించి అన్ని నియోజకవర్గాలలోను జనసేనని గెలిపించుకోవడం కోసం కృషి చేస్తామని తెలిపారు.