చావడానికి సిద్దపడిన జబర్దస్త్ కమెడియన్లు.. కారణం అదే?

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రతివారం సరికొత్త స్కిట్ లతోప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతోంది.

ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ప్రోమోలో భాగంగా ఎక్స్ట్రా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ చావడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ టీమ్ సభ్యులు అయిన ఆటో రాంప్రసాద్, ఆది ప్రోమో ఎంట్రీ లోనే కనిపిస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించారు.

పంచ్ ఉన్నది కౌంటర్ లేదు వాట్ అమ్మ వాట్ ఈజ్ దిస్ అమ్మా అంటూ పాటతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్కిట్ చేశాడు.

ఈ క్రమంలోనే రైల్వే పట్టాల పైకి వెళ్లడంతో హైపర్ ఆది మాట్లాడుతూ ఏంటన్న చనిపోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చారు ఏంటి అని అడగడంతో అందుకు ఆటో రాంప్రసాద్ నాకు బస్సు పడదు కదారా అంటూ ఆటో పంచ్ వేసాడు.

"""/"/ ఈక్రమంలోనే రైజింగ్ రాజు ఎంటర్ అవుతూ ఏంటి సార్ మీరు కూడా సూసైడ్ చేసుకోవటానికి వచ్చారా అంటూ ఆది, రాంప్రసాద్ ను అడిగారు.

అందుకు ఆటో రాంప్రసాద్ మీరు కూడా చనిపోవాలి అనుకుంటున్నారా అని అడగగా రైజింగ్ రాజు అవునని సమాధానం చెప్పడంతో ఆటో రాంప్రసాద్ సార్ మీరు చనిపోయి పోలీసులు ఎంక్వైరీలు అవన్నీ అవసరమా ఎలాగో కొద్ది రోజులు ఉంటే మీరే పోతారు కదా అంటూ రైజింగ్ రాజు పై పంచ్ వేశాడు.

ఇలా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన సినిమాలివే.. వీటికి మాత్రమే ఇంత క్రేజ్!