ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ ప్రస్తుతం అవకాశాలు లేక…

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయినటువంటి కోల్కతా బ్యూటీ "తనూ రాయ్" సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

 అయితే ఈ అమ్మడు వచ్చిరావడంతోనే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వంటి స్టార్ హీరో సరసన నటించి ఎంట్రీ ఇచ్చింది.

 అంతేగాక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు తను రాయ్ కెరియర్ లో చెప్పుకోదగ్గ హిట్ చిత్రంగా నిలిచిపోయింది.

దీంతో ఆ తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన "ఆనందం" చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించింది.

 ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇలా వరుసగా హిట్ చిత్రాలలో నటించినటువంటి తనూ రాయ్ కొంత కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.

ఆ తర్వాత కొంత మేర కథల ఎంపికలు మరియు తాను నటించినటువంటి చిత్రాలలోని పాత్రల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో తనూ రాయ్ హీరోయిన్ గా అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

దీనికి తోడు అప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం గెస్ట్ అప్పియరెన్స్ మరియు "కామియో అప్పియరెన్స్" పాత్రలో కనిపించింది.

 దీంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని కోల్పోయి క్రమక్రమంగా సినిమా అవకాశాలను పూర్తిగా కోల్పోయింది.

  ఇక  చేసేదేమీలేక పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లవ్ కూడా నటించింది.

అయినప్పటికీ ఈ అమ్మడి సినీ కెరీర్ మాత్రం  మలుపు తిరగలేదు. """/"/ కాగా తెలుగులో చివరగా తనూ రాయ్ నూతన దర్శకుడు "శంకర్ జి" దర్శకత్వం వహించిన "ఓ మంజుల కథ" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించింది.

 ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు తెలుగు చిత్రాలలో ఈ అమ్మడు నటించలేదు. కాగా ప్రస్తుతం మలయాళంలో  "ప్రచాయ్" అనే చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

 అయితే ఈ మధ్య కాలంలో తనూ రాయ్ చేతిలో కొత్త సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు అంతేగాక వరుడు కూడా ఆమె చిన్ననాటి స్నేహితుడని కొందరు సినిమా పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.

 కానీ ఇప్పటివరకు తనూ రాయ్ మాత్రం తన పెళ్లిపై వస్తున్న వార్తల గురించి మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు.

ముద్రగడపై నటుడు పృథ్వీరాజ్ సీరియస్ వ్యాఖ్యలు..!!