బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ విచారణకు రావాలని ఐటీ నోటీసులు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు విచారణకు రావాలంటూ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇటీవల మూడు రోజులపాటు ఎమ్మెల్యేల నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చింది.దీంతో ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ అధికారులు ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

అటు మరో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని గురువారం విచారణకు రావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

పాలస్తీనాకు సపోర్ట్ .. సింగపూర్‌లో అభియోగాలు, కేరళ వెళ్తానంటూ కోర్టుకెక్కిన భారత సంతతి మహిళ