డే కేర్ సెంటర్ లో ఘనంగా ఐటి శాఖ మంత్రి పుట్టిన రోజు వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీదర్ బాబు జన్మదిన వేడుకలు ఎల్లారెడ్డిపేట తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటలో గల డే కేర్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో జీవించాలని,తెలంగాణ రాష్ట్రములో ఐటి రంగాన్ని అభివృద్ధి చేయాలనీ ఆమె ఆకాంక్షించారు.

ఆమె వెంట ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్,పుల్లయ్య గారి తిరుపతి గౌడ్,గంట వెంకటేష్ గౌడ్,దీటి సతీశ్ కుమార్,గడ్డం జితేందర్, బుర్క జ్యోతి లు పాల్గొన్నారు.

Narendra Modi Brings Good News To Khammam