కోమటిరెడ్డి పార్టీపై నిందలు వేయడం సరికాదు..: ఎంపీ లక్ష్మణ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ మంచి హోదా ఇచ్చిందని ఆ పార్టీ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీపై నిందలు వేయడం సరికాదని తెలిపారు.పార్టీ రాజగోపాల్ రెడ్డిని గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించిందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు అంతా చూస్తున్నారన్న ఆయన హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.

ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.అదేవిధంగా కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, మూడోసారి ప్రధానిగా మోదీ నిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అధిక బ‌రువు ఉన్న‌వారికి వ‌రం పాల‌కూర‌.. ఇలా తీసుకుంటే మ‌స్తు లాభాలు..!