పెళ్లికి అంగీకరించలేదని దారుణం.. ప్రియురాలికి నిప్పంటించిన ప్రియుడు!

రోజురోజుకీ ఇలాంటి ఘటనలు మానవత్వాన్ని మంటగలిపేస్తున్నాయి.వ్యవస్థలలో వచ్చి మార్పులు కూడా మనిషని మార్చడం లేదు.

విచక్షణను కోల్పోయిన మనిషి మృగంలాగా మారుతున్నాడు.తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో ఘోరం జ‌రిగింది.

పెండ్లికి ఒప్పుకోలేద‌న్న కార‌ణంతో ఓ వివాహితుడు 19 ఏండ్ల యువ‌తిపై కిరోసిన్ పోసి మరీ నిప్పుపెట్టాడు.

పైగా బాధితురాలి ఇంటి వెళ్లి మ‌రీ ఈ దారుణానికి ఒడిగట్టాడు.నిద్ర‌పోతున్న యువ‌తికి నిప్పుపెట్టి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.

వెంట‌నే కుటుంబ‌స‌భ్యులు ఆమెను స‌మీప ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా.అక్కడ వైద్యం చేయలేమని వారు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం జార్ఖండ్ రాజ‌ధాని రాంచికి తీసుకెళ్లారు.

బాధితురాలిని ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు 90 శాతం కాలిన గాయాలైన‌ట్లు తెలిపారు.ప్ర‌స్తుతం ఆమె మృత్యువుతో పోరాటం చేస్తున్న‌ది.

వివ‌రాల్లోకి వెళ్తే.బాధితురాలి గ్రామానికే చెందిన రాజేశ్ రౌత్‌కు ఇప్ప‌టికే పెండ్ల‌య్యింది.

అయినా గ్రామంలోని 19 ఏండ్ల యువ‌తిపై కన్నేశాడు. """/"/ ఈ క్రమంలో ఆమె వెంటపడుతూ, త‌న‌ను పెండ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధించ‌డం మొద‌లుపెట్టాడు.

అందుకు బాధితురాలు అనేకమార్లు హెచ్చరించింది.అయినా ఆ కామాందుడు విడిచిపెట్ట‌లేదు.

మ‌ళ్లీమ‌ళ్లీ ఒత్తిడి తీసుకొచ్చాడు.దాంతో ఆమె త‌న కుటుంబ‌స‌భ్యులకు విష‌యం చెప్పింది.

వాళ్లు కూడా రాజేశ్‌కు చీవాట్లు పెట్టి, మ‌రోసారి మా పిల్ల జోలికి రావ‌ద్ద‌ని హెచ్చ‌రించారు.

దాంతో యువ‌తిపై కోపం పెంచుకున్న రాజేశ్ ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు.ప్రస్తుతం పరారీలో వున్న ఆ మృగం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఖడ్గం సినిమా విషయంలో ఈ ఒక్క లోటు ఎప్పటికి ఎందుకు ఉంది ?