గాజాపై ఇజ్రాయెల్ దాడి .. భారతీయుడు దుర్మరణం, ఐక్యరాజ్యసమితి దిగ్భ్రాంతి
TeluguStop.com
ఇజ్రాయెల్ - హమాస్( Israel–Hamas ) యుద్ధం నానాటికీ తీవ్ర రూపు దాల్చుతోంది.
ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేలా చేసేందుకు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా కృషి చేస్తోంది.
కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి.హమాస్ను పూర్తిగా నేలమట్టం చేసేవరకు తగ్గేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
మరోవైపు ఈ యుద్ధ బాధితులకు మానవతా సాయం అందిస్తోన్న సామాజిక కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా ఓ భారతీయుడు అలాగే మరణించాడు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/05/Gaza-Israel–Hamas-war-Antonio-Guterres-Hamas-United-Nations-Gaza-Indian-staff!--jpg" /
ఐక్యరాజ్యసమితికి చెందిన భారతీయుడు గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
ఈ క్రమంలో రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి ఐరాస సిబ్బంది వెళ్తుండగా ఈ దాడి జరిగింది.
ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోగా.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుడు ఐక్యరాజ్యసమితిలోని భద్రత, రక్షణ విభాగంలో పనిచేస్తున్నారు.ఆయన పేరు, ఇతర వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
కానీ సదరు వ్యక్తి గతంలో భారత సైన్యంలో పనిచేసినట్లుగా కథనాలు వస్తున్నాయి.ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐరాస సిబ్బంది మరణించడం ఇదే తొలిసారి.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/05/Israel–Hamas-war-Antonio-Guterres-Hamas-United-Nations-Gaza-Indian-staff!--jpg" /
ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్( Antonio Guterres ) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
యుద్దం కారణంగా సామాన్యులతో పాటు మానవతా సాయం అందజేస్తున్న సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వెంటనే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని గుటెరస్ అన్నారు.
దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని.బందీలను హమాస్( Hamas ) సైతం విడిచిపెట్టాలని ఆయన సూచించారు.
కాగా.ఈ నెల ప్రారంభంలోనూ గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై హమాస్ రాకెట్లతో దాడి చేయడం కలకలం రేపింది.
ఈ ఘటనలో ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.గాజాకు మానవతా సాయం అడ్డుకునేందుకే హమాస్ ఈ దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ ఆరోపించగా.
తాము ఐడీఎఫ్ కార్యాలయంపైనే దాడి చేశామని హమాస్ చెబుతోంది.