సమాజంలో మానవత్వనికి చోటు కరువైందా..? సొంత మనవరాలిపై తాత అత్యాచారం..!

ఇదెక్కడి దారుణం.సమాజంలో మానవత్వానికి చోటు కరువైంది.

ఇటీవలే కాలంలో జరగకూడని సంఘటనలు, వినకూడని విషయాలు పెరుగుతూ పోతున్నాయి.భవిష్యత్తు కాలంలో సమాజంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకుంటే భయమేస్తుంది.

కొడుకు కుమార్తె పై తాత( Grandfather ) అత్యాచారం( Rape ) చేస్తే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదేమో.

ఓ 60 ఏళ్ల కామాంధుడు, వావి వరసలు మరిచి తన సొంత 15 ఏళ్ల మనవరాలిపై అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ ( Gorakhpur )లో చోటుచేసుకుంది.

బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన సమాచారం ఏమిటంటే.బుధవారం సాయంత్రం తాను, తన కూతురు కలిసి మేకలను మేపుతుండగా ఇంతలో తన మామ వచ్చి తనను ఇంటికి వెళ్ళమని చెప్పాడు.

కట్టెలు కొట్టేందుకు గొడ్డలి తీసుకురావాలని మనవరాలుకి చెప్పడంతో, గొడ్డలి తీసుకువచ్చిన మనవరాలిని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

"""/" / ఈ విషయం బయట ఎవరితో చెప్పకూడదని బెదిరించి, మనవరాలు చేతిలో రూ.

10 రూపాయలు పెట్టాడు.పక్కా పొలం వ్యక్తి నీరు తెచ్చేందుకు అటువైపుగా వచ్చి జరుగుతున్న సంఘటన గమనించి, గ్రామస్తులకు విషయాన్ని చేరవేశాడు.

బాలిక తల్లితో సహా గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని బాలికను రక్షించి, బాలిక తాతయ్యను చితకొట్టి పోలీసులకు అప్పగించారు.

"""/" / పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో 60 ఏళ్ల కామాంధుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఇంట్లో ఉండే సొంత మనవరాలి పైనే తాత అత్యాచారం చేయడం చాలా బాధాకరం.

స్థానికంగా చుట్టుపక్కల వాళ్లకు ఈ సంఘటన తీవ్రంగా కలిచి వేసింది.ఇటువంటి దుర్మార్గులను చనిపోయే వరకు జైలు శిక్ష విధించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై పవన్ ప్రశంసలు.. ఆ దర్శకుడి డైరెక్షన్ లో నటిస్తాడా?