రాజీనామా ఆలోచనలో జనసేన కీలక నేత ? 

ఏపీలో టిడిపి ,జనసేన ,బిజెపిలు ( TDP, Janasena, BJP ) పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్నాయి.

ఈ ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు ముందుకు వెళుతున్నాయి.

టిడిపి,  బిజెపిలతో పొత్తు కారణంగా జనసేన 21 అసెంబ్లీ,  2 ఎంపీ స్థానాలను మాత్రమే తీసుకుంది.

అయితే కనీసం 50 స్థానాలైనా జనసేనకు పొత్తుల భాగంగా టిడిపి కేటాయిస్తుందని ఆ పార్టీ నాయకులు భావించినా, అది సాధ్యం కాలేదు.

  దీంతో జనసేన లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ,మొదటి నుంచి నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న నాయకులకు ఈ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.

అలాగే చివరి నిమిషంలో టిడిపి నుంచి జనసేన లో చేరిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించడం ,తదితర వ్యవహారాలపై ఆ పార్టీ నాయకులు కొంతమంది అసంతృప్తికి గురై ఇప్పటికే పార్టీ మారగా , మరి కొంత మంది అదే బాటలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

"""/" / సీట్ల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఎక్కువగా ఉంది.

ఈ అసంతృప్తితోనే చాలామంది నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు.ఇపటికే అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కరరావు( Incharge Paruchuri Bhaskara Rao ) పార్టీకి రాజీనామా చేశారు.

  జనసేన నేతల్లో కీలకంగా ఉన్న పితాని బాలకృష్ణ( Pithani Balakrishna ) కూడా పార్టీ కి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

తాజాగా మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.కాకినాడ సిటీ జనసేన ఇన్చార్జిగా ఉన్న ముత్తా శశిధర్ ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారట.

2019 ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి శశిధర్ పోటీ చేసి ఓటమి చెందారు.

"""/" / గతంలో కాకినాడలో పవన్ పర్యటించిన సమయంలో  కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానాన్ని శశిధర్ కు కేటాయిస్తామని హామీ ఇచ్చారు .

కానీ పొత్తు లో భాగంగా ఆ సీటు ను ఇప్పుడు టిడిపికి కేటాయించడంతో,  ముత్తా శశిధర్ అసంతృప్తితో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం .ఇప్పటికే పవన్ పీఠాపురం పర్యటనకు శశిధర్ దూరంగానే ఉన్నారు.

ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేసేందుకు శశిధర్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.