జాన్వీ కపూర్ తరచూ శ్రీవారిని దర్శించుకోవడానికి అదే కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో దివంగత నటి శ్రీదేవి( Sridevi ) ఒకరు.

నటిగా ఇండస్ట్రీలో వివిధ భాషలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీదేవి అకాల మరణం ఇప్పటికి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇకపోతే శ్రీదేవి వారసురాలిగా తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ( Jhanvi Kapoor ).

హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి దేవర సినిమా ( Devara Movie ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

"""/" / ఇదిలా ఉండగా తాజాగా ఈమె పట్టు పరికిణి ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ విధంగా తరచూ ఈమె తిరుమల శ్రీవారిని( Tirumala Srivaru ) దర్శించుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.

ఈమె ఏడాదికి తప్పనిసరిగా మూడుసార్లు తిరుమల స్వామివారిని దర్శించుకుంటారు.అదే విధంగా ఏదైనా తనకు సంబంధించి ప్రత్యేకమైన రోజులలో కూడా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.

"""/" / ఈ విధంగా ఈమె తరచూ తిరుమల రావడానికి మరే కారణం లేదు తన తల్లి శ్రీదేవి తిరుమల శ్రీవారిని ఎంతగానో విశ్వసించే వారట ఆమె కూడా తరచూ ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకోవడమే కాకుండా, తనకు సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన పనులు చేసేముందు లేదా వాటిని కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి అంటే ముందుగానే ఈ తిరుమలవచ్చే స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాతే ఆ విషయాలను బయటపెట్టేవారట ఇలా తల్లికి స్వామి వారిపై ఎంతో నమ్మకం ఉండడంతో అదే నమ్మకాన్ని జాన్వీకపూర్ స్వామి వారిపై పెట్టారని అందుకే ఈమె కూడా పుట్టినరోజులు లేదా తాను ఏదైనా సినిమాలను ప్రకటించే సమయంలోనూ అలాగే సినిమాల విడుదల సమయంలోను తప్పకుండా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని తెలుస్తోంది.

మోక్షజ్ఞ, అకీరా నందన్, గౌతమ్ కృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే భవిష్యత్ హీరోలు వీళ్లేనా?