రష్మిక రక్షిత్ శెట్టి బ్రేకప్ చెప్పుకోవడానికి ఆ వ్యక్తి కారణమా.. అందుకే విడిపోయారా?
TeluguStop.com
కన్నడ చిత్ర పరిశ్రమకు కిరిక్ పార్టీ ( Kirik Party ) సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు.
నటి రష్మిక మందన్న(Rashmika Mandannaa) .ఆ సినిమాలో తనకు జోడిగా నటించిన నటుడు రక్షిత్ శెట్టి ( Rakshith Reddy ) ప్రేమలో పడ్డారు.
ఇలా మొదటి సినిమాతోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం జరిగింది.ఈ విధంగా ప్రేమలో ఉన్నటువంటి రష్మిక,రక్షిత్ శెట్టి పెళ్లి చేసుకోవాలని భావించారు.
ఈ క్రమంలోనే వీరిద్దరూ 2017 వ సంవత్సరంలో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలోనూ సినీ సెలబ్రిటీల సమక్షంలోను ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం.
( Engagment) జరుపుకున్నారు.ఇలా ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కావాల్సి ఉండగా బ్రేకప్ చెప్పుకున్నారు.
"""/" /
ఈ విధంగా రష్మిక రక్షిత్ శెట్టితో బ్రేకప్ చెప్పుకోవడమే కాకుండా తిరిగి తన సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టారు.
దీంతో ఈమెకు కన్నడ భాషలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి అవకాశాలు వచ్చాయి.
తెలుగు భాషలో కూడా అద్భుతమైన సినిమాలలో నటించిన రష్మిక అనంతరం పుష్ప( Pushpa ) సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.
ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
"""/" /
ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి రష్మిక తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో బ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా వీరిద్దరూ విడిపోవడానికి ఓ వ్యక్తి కారణమని తెలుస్తోంది.రష్మిక రక్షిత్ శెట్టి విడిపోవడానికి మరెవరో కారణం కాదు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Venu Swamy ) .
రష్మిక రక్షిత్ శెట్టి నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈయన వీరిద్దరి జాతకాలు చూసి పెళ్లి చేసుకుంటే విడిపోతారని చెప్పారట.
అదేవిధంగా రష్మిక సినీ కెరియర్ కూడా నాశనం అవుతుందని చెప్పడంతో రష్మిక తన కెరియర్ కోసం తన ప్రియుడిని వదులుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.