రాధే శ్యామ్ మరోసారి వాయిదా పడబోతుందా !

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.

ఈ సినిమా తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

ఎప్పుడో రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా జులై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

అయితే ఇప్పుడు మరొక గాసిప్ మొదలయ్యింది.ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది.

మహారాష్ట్రలో మరింత విజృంభిస్తుంది.అందువల్ల మరొక సారి ఈ సినిమా వాయిదా పడబోతుందని వార్తలు వస్తున్నాయి.

"""/"/ ముంబైలో కూడా కరోనా ఎక్కువుగా ఉండడం వల్ల అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి ఆటంకాలు ఎదురవుతున్నట్టు తెలుస్తుంది.

సినిమా అనంతరం కీలకమైన వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా దానికి అడ్డుగా కరోనా మారిందని ఇప్పుడు ఆ పనులను హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాల్సి ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇది జరగడానికి టైం పడుతుంది కాబట్టి అనుకున్న టైం కి పనులు పూర్తి కావు.

అందువల్ల రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం స్పష్టం అవ్వదు.

ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా సలార్, ఆది పురుష్ సినిమాలు కూడా అనౌన్స్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.

ఈ రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ పూర్తి చేస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నాడు.

ఈ ఇద్దరు గేమ్ చెంజర్స్ లో ఇంత మార్పు ఎలా వచ్చింది ?