క‌రోనా భ‌యం కంటే చేప‌లే ముఖ్యమా.. ఇదేంద‌య్యా ఇది!

కరోనా.భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వైరస్​.

ప్రస్తుతం కూడా ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి.మన దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి.

సెకండ్​ వేవ్​ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ.అన్​లాక్​ డౌన్​ ప్రక్రియ మొదలుపెడుతున్నాం.

అయితే అన్​లాక్​డౌన్​ మొదలైనంత మాత్రాన.కరోనా వెళ్లిపోయినట్టు కాదు కదా.

కేవలం దేశ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి.కానీ కరోనా నిబంధనలైన భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు తరచూ కడుక్కోవడం, సానిటైజ్​ చేసుకోవడం చేయాలని, గుంపులు గుంపులుగా ఉండకూడదని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.

కానీ ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను కొందరు మిస్​ యూస్​ చేస్తున్నారు.తాత్కాలిక ఆనందాల కోసం ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.

తమిళనాడులోని విళరీపట్టి గ్రామస్తులు చేపలు కోసం ఎగబడ్డారు.కరోనా నిబంధనలు గాలికొదిలేశారు.

ఒక్కరూ మాస్కులు ధరించలేదు.భౌతికదూరం పాటించలేదు.

తామంటే తామంటూ చేపల కోసం పోటీ పడ్డారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

విళరీపట్టి గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరళివచ్చారు.

చేపల కోసం పెద్ద ఫైటే చేశారు. """/"/ చేపలు తినకపోతే బతకలేము అనుకున్నారో ఏమో.

ఎగబడి మరీ చేపలు పట్టడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు ఏంటని ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

మొన్నటి వరకు కరోనా కేసులు, మరణాలు ఎన్ని సంభవించాయో ఒక సారి గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్​ వేవ్​ తగ్గిపోతోందని, ఇలాంటి చర్యల వల్ల అది మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి చర్యలు చేయకండని సూచించారు.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?