వివేకా హత్య కేసులో ఏ2 బెయిల్ పిటిషన్ పై విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.

ఈ మేరకు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారించింది.

వివేకానంద రెడ్డి హత్య జరిగిన ప్రాంతంలో సునీల్ యాదవ్ ఉన్నాడన్న గూగుల్ టేకౌట్ సమాచారం తప్పని సునీల్ యాదవ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దీనిని సీబీఐ కూడా ఒప్పుకుందని లాయర్ పేర్కొన్నారు.అసలు నిందితుల విషయంలో వైఎస్ సునీతా రెడ్డి అభ్యంతరం చెప్పడం లేదన్నారు.

దీనిపై ఈనెల 8వ తేదీన సీబీఐ తన వాదనలు వినిపించనుంది.దీంతో తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది.

ఆ దేశంలో సైతం విడుదలవుతున్న ఎన్టీఆర్ దేవర.. సంచలన రికార్డులు మాత్రం పక్కా!