విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు వేగవంతం

విశాఖ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో దూకుడు పెంచిన పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేసిన ఎనిమిది మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు.

ఈ మేరకు నిందితులను 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మెజిస్ట్రేట్ ను కోరారు.

అదేవిధంగా హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులకు సైతం నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కిడ్నీ రాకెట్ కేసులో ప్రైవేట్ ఆస్పత్రుల పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!