జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో దర్యాప్తు ముమ్మరం..

జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి లభించింది.ట్రావెల్స్ పై నమోదైన కేసుల్లో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.

మొత్తం 33 కేసుల్లో ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు.ఈ మేరకు తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఈ ఛార్జ్ షీట్లను దాఖలు చేయనున్నారు పోలీసులు.

అదేవిధంగా నిషేధిత బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు.

నకిలీ ఇన్ వాయిస్, ఫేక్ సర్టిఫికెట్స్ తో బీఎస్-4 వాహనాలుగా చూపించి అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడ్డారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదైంది.