పోలీస్ ఎస్సై నియామక ప్రక్రియపై ఏపీ హైకోర్టులో విచారణ

పోలీస్ ఎస్సై నియామక ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ క్రమంలో పిటిషనర్ తరపు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

పిటిషన దాఖలు చేసిన వారు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎస్సై నియామక ప్రక్రియలో ఎత్తు కొలతలకు సంబంధించి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సెలెక్షన్ ప్రాసెస్ పై సింగిల్ బెంచ్ న్యాయస్థానం స్టే విధించగా దాన్ని సవాల్ చేస్తే ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది.

దక్షిణాసియా వ్యాపారవేత్తలే టార్గెట్‌ : కెనడా పోలీసుల అదుపులో ఆరుగురు పంజాబీ యువకులు