ఐఆర్ఆర్ కేసులో సీఐడీ 41ఏ నోటీసులపై ఏపీ హైకోర్టులో విచారణ

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ 41 ఏ నోటీసులపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది.

ఈ మేరకు నోటీసులపై విచారణ చేపట్టిన ధర్మాసనం మాజీ మంత్రి నారాయణను ఇంటి వద్దే విచారించాలని పేర్కొంది.

ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో నారాయణను నెల్లూరులోని ఆయన నివాసంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

నారాయణ వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి వద్దే విచారించాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది.

మరోవైపు ఇదే కేసులో నారాయణ అల్లుడు పునీత్ విచారణకు సీఐడీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే.

తరచూ స్వీట్స్ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!