చిత్తూరు జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన ఫేస్ బుక్ పరిచయం..!
TeluguStop.com
ఫేస్ బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది.ఈ విచారకర ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వి.కోటకు చెందిన మురళీ అనే యువకుడు బెదిరింపులు తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం.
మృతుడు మురళీకి ప్రియాశర్మ పేరుతో ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయమైంది.
ఈ క్రమంలోనే ఇటీవల యువతితో యువకుడు వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడాడు.అనంతరం మురళీ వీడియోని మార్ఫింగ్ చేసిన ప్రియాశర్మ డబ్బులు ఇవ్వకుంటే యూట్యూబ్ లో వీడియో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలుస్తోంది.
దీంతో తాను ఓ కూలీనని, డబ్బులు ఇవ్వలేనంటూ వాట్సాప్ లో వేడుకున్నాడు.అయినా యువతి బెదిరింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మురళీ రాత్రి బలవన్మరణం చెందాడని పోలీసులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సుంకాల యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ను ఢీకొడుతోన్న కెనడా నేత