వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తిప్పాపూర్ లోని ఏరియా ఆసుపత్రిలో కౌన్సిలర్ వైద్యాధికారులతో కలిసి ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని ప్రారంభం కార్యక్రమనికి ముఖ్య అతిధీగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని కౌన్సిలర్, వైద్యాధికారులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని మహిళలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు అన్నింటిని ప్రభుత్వాసుపత్రిలో పతి మంగళవారం స్త్రీల వైద్యనిపులచే పరీక్షల నిర్వహించి ఉచితంగా మందులు తగు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

కావున మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కందుల శ్రీలత క్రాంతి, డాక్టర్ దివ్యశ్రీ, ఆరోగ్య పర్యవేక్షకులు ఝాన్సీ మని రాజయ్య, స్టాఫ్ నర్స్ లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కొండ సురేఖ వివాదం .. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి విన్నపం