'జబర్దస్త్' రెమ్యూనరేషన్స్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
TeluguStop.com
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను గత ఏడు సంవత్సరాలుగా ఆకట్టుకుంటున్న కామెడీ షో జబర్దస్త్.
ఈ కామెడీ షోలో ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
కొందరు స్టార్స్ కూడా అయ్యారు.ఈ షో ఆరంభం నుండి కూడా ఇందులో కనిపించే కమెడియన్స్ రెమ్యూనరేషన్ గురించిన చర్చ జరుగుతూనే ఉంది.
ఇప్పటికి ఆ విషయమై చర్చలు సాగుతున్నాయి.గతంలో స్కిట్కు ఇంత అంటూ పారితోషికం ఇచ్చేవారట.
కాని ఇప్పుడు పద్దతి మారినట్లుగా తెలుస్తోంది. """/"/
ప్రస్తుతం నెలకు ఇంత అంటూ కమెడియన్స్కు జీతం మాదిరిగా ఇస్తున్నట్లుగా ఈటీవీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
జబర్దస్త్ ద్వారా అత్యధిక జీతం తీసుకుంటున్న వ్యక్తి నాగబాబు.ఈయన నెలకు 15 లక్షల వరకు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇక మరో జడ్జ్ రోజా 10 లక్షలు నెలకు తీసుకుంటుంది.వీరిద్దరి తర్వాత యాంకర్స్ అయిన అనసూయ 5 లక్షలు రష్మి 3 లక్షల రూపాయల జీతాలను జబర్దస్త్ నుండి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
"""/"/
ఇక కమెడియన్స్ విషయానికి వస్తే సుడిగాలి సుధీర్ మరియు చమ్మక్ చంద్రలు 4 లక్షల జీతం తీసుకుంటున్నారు.
హైపర్ ఆది నెలకు 3 లక్షల జీతం పుచ్చుకుంటున్నాడు.ఇతర టీం లీడర్స్ రెండు నుండి మూడు లక్షల మద్యలో పారితోషికాలు అందుకుంటున్నారు.
ఇతర కంటెస్టెంట్స్ మరియు కమెడియన్స్ 75 వేల నుండి రెండు లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటున్నారు.
ఈ మొత్తంతో పాటు స్కిట్ కొడితే అదనంగా డబ్బులు.మరియు స్కిట్ను సొంతంగా రాసుకుంటే అదనంగా డబ్బులు ఇస్తారని తెలుస్తోంది.
Viral : కోతుల దెబ్బకి గోరిల్లాలా మారిన గ్రామ పంచాయతీ కార్యదర్శి.. అసలు మ్యాటరేంటంటే…?!