మేడం టుస్సాడ్స్ లో చరణ్ మైనపు విగ్రహం.. సంతోషంలో మెగా ఫ్యాన్స్?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈయన శంకర్( Shankar ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
తదుపరి సుకుమార్, బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమాకు కమిట్ అయ్యారు.ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నటువంటి చరణ్ RRR సినిమా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
"""/" /
ఈ సినిమా ద్వారా ఈయనకు పాన్ ఇండియా గుర్తింపు లభించడమే కాకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.
ఈ సినిమా తర్వాత ఎన్నో అవార్డులను ఎన్నో గౌరవాలను సొంతం చేసుకున్న రామ్ చరణ్ మరొక అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ హీరోల మైనపు విగ్రహాలను( Wax Statue ) మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ముందుగా ప్రభాస్ విగ్రహాన్ని లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
అనంతరం ఇదే మ్యూజియంలో మహేష్ బాబు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. """/" /
ఇకపోతే దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఈ ముగ్గురు హీరోలకు ఎంతో అరుదైన గౌరవం లభించగా తాజాగా రామ్ చరణ్ కూడా ఇలాంటి గౌరవాన్ని అందుకోబోతున్నారని తెలుస్తోంది.
రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే రామ్ చరణ్ లండన్ వెళ్లి తన కొలతలు కూడా ఇచ్చినట్టు సమాచారం.
ఇక ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో ఉన్న ఈ ఆరుగురి హీరోల్లో ఎవరు నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా..?