తెలంగాణ కాంగ్రెస్‎లో ఆసక్తికర పరిణామాలు

తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు.

కోమటిరెడ్డి మద్ధతుతో వేముల వీరేశం, శశిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని సమాచారం.

ఈ క్రమంలోనే కోమటిరెడ్డితో భేటీ అయిన ఆయన చేరిక అంశంపై చర్చించారు.అయితే వేముల వీరేశం, శశిధర్ రెడ్డి పార్టీలోకి రావడంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

తనను సంప్రదించకుండా నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

కాగా కోమటిరెడ్డితో భేటీ అనంతరం ఆయనతో కలిసి రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు.

వావ్.. డాల్ఫిన్‌ కు తెగ నచ్చేసిన చిన్నారి.. వీడియో వైరల్..