ఆసక్తిగా ఖమ్మం జిల్లా రాజకీయాలు..!!

ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.పార్టీ మార్పుపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఆత్మీయులతో చర్చించనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు జిల్లాలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఉదయం 7 గంటలకు సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.

ఇందులో భాగంగా పొంగులేటి అభిమానులు, కార్యకర్తలకు ఫోన్లు వెళ్లాయి.సమావేశం పూర్తయిన తరువాత పార్టీలో చేరికపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

కాగా చేరిక వ్యవహారంతో పాటు బహిరంగ సభ ఏర్పాట్లపై కూడా పొంగులేటి సమాలోచనలు చేస్తున్నారు.

దీంతో ఖమ్మం రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు..!