ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో కేసులో అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ తిరస్కరణపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.

ఫామ్ హౌజ్ లో ముందే కెమెరాలు రికార్డింగ్ వ్యవస్థ పెట్టారా అని న్యాయస్థానం ప్రశ్నించింది.

ప్రతి కేసులో 41ఏ సీఆర్పీసీ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదని ఏజీ తెలిపారు.

ఈ క్రమంలో నిందితులు 24 గంటలు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

అదేవిధంగా సాయంత్రం లోపు నిందితుల చిరునామాలు సీపీకి ఇవ్వాలని సూచించింది.అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

స్టార్ హీరో మోహన్ లాల్ పిరికివాడు.. ప్రముఖ నటి పార్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!