జోనర్ మార్చేసి ప్రేమకథని చెప్పబోతున్న ఇంద్రగంటి

ప్రయాణం సినిమాతో దర్శకుడుగా తన ప్రయాణం మొదలు పెట్టి అష్టాచెమ్మా లాంటి క్లాసిక్ కామెడీతో హిట్ కొట్టి తరువాత కామెడీ, డిఫరెంట్ కథ చిత్రాలతో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.

కామెడీ కథలని ఆహ్లాదంగా తెరపై ఆవిష్కరించడంతో ఇంద్రగంటికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.అలాగే నానితో జెంటిల్మన్ అనే సినిమాతో క్రైమ్ థ్రిల్లర్ ని కూడా అంతే అద్బుతంగా ఆవిష్కరించి హిట్ కొట్టాడు.

అయితే దిల్ రాజు ప్రొడక్షన్ లో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో వి అనే సినిమాని లాక్ డౌన్ కాలంలో ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఓ సాదాసీదా కథకి క్రైమ్ థ్రిల్లర్ కలరింగ్ ఇచ్చి ఆడియన్స్ కి రొటీన్ స్టొరీ చూపించారనే విమర్శలు వినిపించాయి.

ఈ నేపధ్యంలో కొంత గ్యాప్ తీసుకొని ఈ సారి ఓ ఫ్రెష్ లవ్ స్టొరీని చెప్పడానికి రెడీ అయ్యాడు.

సుదీర్ బాబు హీరోగా, క్రేజీ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా ఫైనల్ చేసి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.మార్చిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కంటెంట్, టైటిల్ ని మార్చి 1న ఎనౌన్స్ చేయబోతున్నట్లు సుదీర్ బాబు ఓ ఇంటరెస్టింగ్ వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా కథాంశం ప్రెజెంట్ జెనరేషన్ యూత్ అందరికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ తో ఉంటుందని చెప్పేశాడు.

ఫస్ట్ లవ్ ని ఎలా ఎక్స్ ప్రెస్ చేస్తామనే పాయింట్ తో ఈ కథాంశం చెప్పబోతున్నామని చెప్పాడు.

మరి ఈ సారి ఇంద్రగంటి జోనర్ మార్చి పూర్తిస్థాయిలో ప్రేమకథని ఈ సినిమా ద్వారా ఎలా చెప్పబోతున్నాడు అనేది తెలియాలంటే వేచి చూడాలి.

20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు చూశా.. సీఎం రేవంత్