ఆంటీని పలుమార్లు కత్తితో పొడిచిన పదహారేళ్ల కుర్రాడు.. ఎందుకో తెలిస్తే..

ఇటీవల కాలంలో చిన్నపాటి కారణాలకే మనుషులను చంపేంత కౄర మృగాలుగా మారుతున్నారు ప్రజలు.

పెద్దవాళ్లే కాదు చిన్న పిల్లలు కూడా ఇలాంటి నాలుగు పాల్పడుతున్నారు.తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం,( Madhya Pradesh ) ఇండోర్ సిటీలో ఇలాంటి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

ఇటీవల 16 ఏళ్ల బాలుడు 10,000 రూపాయలు కావాలని తన ఆంటీ( Aunt ) ఇంటికి వెళ్లాడు.

ఆంటీ పైసలు ఇవ్వడానికి నిరాకరించడంతో, కోపం తెచ్చాడు బాలుడు.ఆమెపై కత్తితో( Knife ) చాలాసార్లు దాడి చేశాడు.

ఆంటీ మెడ, తల, ఇతర శరీర భాగాలకు గాయాలు అయ్యాయి.ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.బాలుడి చేతికి కూడా చాకు తగిలి గాయపడింది.

పోలీసుల ప్రకారం, గాయపడిన మహిళను మాల్వియా నగర్ నివాసి ఆర్తీ చౌహాన్‌గా.( Aarti Chauhan ) గుర్తించారు.

సమీప పోలీస్ స్టేషన్ అధికారి మనీష్ లోధా, ఆంటీతో జరిగిన డబ్బు విషయమైన గొడవ కారణంగా బాలుడు తన దాడి చేశాడని తెలిపారు.

"""/" / ఆ బాలుడు డబ్బులు ఇవ్వమని అడిగితే ఆంటీ ఇవ్వలేదట.కోపంతో ఆ బాలుడు( Boy ) ఆమెపై కిచెన్ కత్తితో దాడి చేశాడు.

ఆమె కేకలు వేయగా ఆమె కొడుకు కిందకు పరుగు వచ్చాడు.అప్పుడు ఆ బాలుడు అబద్ధం చెప్పి, బయటనుంచి నలుగురు వచ్చి మీ అమ్మ మీద దాడి చేశారని, తననీ పట్టుకున్నారని, డబ్బులు లాక్కుని తననీ పొడిచాడని చెప్పాడు.

తన చేతి గాయం కూడా వాళ్లే చేశారని చెప్పాడు. """/" / అదే కబుర్లు పోలీసులకు కూడా చెప్పాడు.

కానీ, ఆ స్పృహలోకి వచ్చాక పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్నాక అసలు విషయం బయటపడింది.

ఆ ఇంట్లోని పూల కుండీ వెనక దాచిన కత్తిని పోలీసులు పట్టుకున్నారు.ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

వైసీపీ లో దడ పుట్టిస్తున్న అరెస్ట్ లు ? నెక్స్ట్ ఎవరో ?