భారత్‎లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి..

నిర్మాణ రంగంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోంది.ఈ నేపథ్యంలోనే సముద్రంపై అవసరమైన సమయంలో పైకి లేచే విధంగా ఓ రైల్వే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురానుంది.

దీనిని వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రైల్వే మంత్రిత్వ శాఖ పిలుస్తోంది.

దేశంలోనే తొలి దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా ఈ నూతన బ్రిడ్జి నిర్మాణం అవుతోందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మితమవుతున్న ఈ బ్రిడ్జికి న్యూ పంబస్ బ్రిడ్జిగా నామకరణం చేసింది.

సుమారు 63 మీటర్ల పొడవుతో సముద్రంపై ఈ బ్రిడ్జి నిర్మితమవుతోందని తెలిపింది.సముద్రంలో పడవలు, ఓడలు వెళ్లే సమయంలో రాకపోకలకు ఎటువంటి అవాంతరం లేకుండా బ్రిడ్జి పైకి లేస్తుంది.

అనంతరం యథాతథంగా తిరిగి సాధారణ రూపంలోకి వచ్చేస్తుందని వెల్లడించింది.

సీనియర్ హీరో రాజశేఖర్ కు మూవీ ఆఫర్లు తగ్గడానికి కారణాలివేనా.. అక్కడే తప్పు జరిగిందా?