ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ బస్సు లాంచ్.. ఇది వాటర్ ఎమిట్ చేస్తుంది..!

గ్రీన్ హైడ్రోజన్‌తో( Green Hydrogen ) నడిచే భారతదేశపు మొట్టమొదటి బస్సు 2023, సెప్టెంబర్ 25న లాంచ్ అయ్యింది.

ఈ బస్సు బై-ప్రోడక్ట్ గా నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది, అలా ఇది జీరో-ఎమిషన్ వెహికల్‌గా( Zero Emission Vehicle ) మారుతుంది.

ఈ బస్సును భారతదేశంలోని ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) ప్రారంభించింది.

సోమవారం, భారతదేశపు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి( Hardeep Singh Puri ) భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్-ఆధారిత బస్సును జెండా ఊపి లాంచ్ చేశారు.

దానికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్‌లో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. """/" / గ్రీన్ హైడ్రోజన్ అనేది సౌర, పవన శక్తి వంటి రెన్యువబుల్ ఫ్యూయల్( Renewable Fuel ) వనరులను ఉపయోగించి ఉత్పత్తి అవుతుంది.

ఇది భారత్ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, మరింత స్థిరమైన భవిష్యత్తుకు సహాయపడుతుంది.

అందుకే దీనిని భవిష్యత్తులో కీలక ఇంధనంగా పరిగణిస్తున్నారు.ఒక హైడ్రోజన్ ట్యాంక్‌పై బస్సు 350 కి.

మీల పాటు నడుస్తుంది, ఇది నింపడానికి 10-12 నిమిషాలు పడుతుంది.2023 చివరి నాటికి బస్సుల సంఖ్యను 15కి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

"""/" / పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్తును ఉపయోగించి నీటిని విభజించడం ద్వారా IOC సుమారు 75 కిలోల హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రయల్ రన్ కోసం నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో నడిచే రెండు బస్సులకు శక్తిని అందించడానికి ఈ హైడ్రోజన్ ఉపయోగించబడుతుంది.

మొత్తం మీద ఈ పరిణామం భారతదేశ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలలో ఒక ముఖ్యమైన ముందడుగు.