అమెరికాలో దారుణం 4 హత్యలు చేసి లొంగిపోయిన భారత ఎన్నారై..!

అమెరికాలో ఘోరమైన సంఘటన వెలుగు చూసింది.భారత సంతతి వ్యక్తి, ఐటీ నిపుణుడిగా మంచి పేరు సంపాదించుకున్న శంకర్ నాగప్ప తానూ ఉంటున్న ఇంట్లో, అదే అపార్ట్మెంట్ లోని మరో ముగ్గురిని హత్య చేసి అందులో ఒక శవాన్ని కారులో ఎక్కించుకుని నేరుగా పోలీసుల వద్దకి వెళ్లి లొంగిపోయాడు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని ఓ కంపెనీలో డేటా ఎనలిస్ట్ , సీనియర్ మోస్ట్ గా పనిచేస్తున్న శంకర్ నాగప్ప నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కారులో ఒక డేడ్ బాడీ ఉందని, ఆ హత్య నేనే చేశానని తెలిపాడు.

దాంతో షాక్ అయిన పోలీసులు కారులో ఉన్న శవాన్ని పరిశీలించి అతడిని అరెస్ట్ చేశారు.

అతడి వద్దనుంచీ వివరాలు రాబట్టిన వారికి దిమ్మతిరిగిపోయింది.తాను ఉంటున్న అపార్ట్మెంట్ లో మరో మూడు మృతదేహాలు ఉన్నాయని తెలుసుకున్న వారు హుటాహుటిన అక్కడికి వెళ్లి పరిశీలించారు.

అందులో """/"/  ఇద్దరు పెద్ద వాళ్ళు , ఇద్దరు చిన్న వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోందని వారు చెప్పారు.

వీరంతా ఒకే కుటుంభానికి చెందిన వారుగా గుర్తించిన పోలీసులు అసలు ఈ హత్యలు అతడు ఎందుకు చేశాడు అనే కోణంలో విచారణ చేపట్టామని త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఇదిలాఉంటే నాగప్ప కొంత కాలంగా ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టుగా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది.

ఈ ఒక్క హీరోకి తప్ప శృతిహాసన్ టాలీవుడ్ లో అందరికి హిట్స్ ఇచ్చింది..!