భారీ లాభాలను ఆర్జించిన భారతీయ రైల్వే ...!

రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రైల్వేలు ఆదాయంలోనూ దూసుకుపోతున్నాయి.నిత్యం లక్షల కొద్దీ ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చే భారతీయ రైల్వే ఆదాయ సముపార్జనలోనూ పురోగతి సాధిస్తోంది.

గడిచిన ఆరు నెలల కాలంలో రూ.33 వేల కోట్లకు పైగా రైల్వేకు ఆదాయం పెరిగింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 8 వరకు రైల్వేలకు దాదాపు రూ.

33,476 కోట్లు ఆదాయం సమకూరినట్టు భారతీయ రైల్వే వెల్లడించింది.గతేడాది ఇదే సమయంలో ప్యాసింజర్‌ రెవెన్యూ రూ.

17,394 కోట్లుగా ఉండగా.ఈ ఏడాది అది రెట్టింపుకు పెరగడం గమనార్హం.

రిజర్వేషన్‌ చేయించుకొని 42.89 కోట్ల మంది ప్రయాణికులు రైల్వేల్లో ప్రయాణం చేశారు.

వారి ద్వారా రైల్వేలకు రూ.26,961 కోట్లు ఆదాయం సమకూరినట్టు తెలిపింది.

గతేడాదితో పోలిస్తే ఇది 65 శాతం అధికం.అన్‌ రిజర్వుడు ప్యాసింజర్ల కేటగిరీలో 268.

56 కోట్లు మంది రైల్వేల్లో ప్రయాణించగా.ఈ ఏడాది ఈ సంఖ్య 197 శాతం పెరిగిందని సమాచారం.

ఈ విభాగంలో ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 8 వరకు రైల్వేలకు రూ.

6,515 కోట్ల ఆదాయం సమకూరగా.గతేడాది రూ.

1,086కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.

ఏపీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!