అమెరికాలో రోడ్డు ప్రమాదం: తల్లీ, ఆమె ఇద్దరు పిల్లలు మృతి, ముగ్గురూ భారతీయులే

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.న్యూయార్క్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు.

న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్‌కు చెందిన గయాపర్సద్ కుటుంబం రెండు కార్లలో ట్రినిడాడ్, గయానా విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో న్యూయార్క్ స్టేట్ హైవేపై సోమవారం ఈ ప్రమాదం జరిగింది.

మొదటి కారును వేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది.దీంతో అందులో ప్రయాణిస్తున్న జూలిక గయాపర్సద్, ఆమె కూతురు చెల్సీయా (14), కుమారుడు జస్టిన్ (10) ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

జూలిక రెండో కుమారుడు అమీర్ జగదీయోకు తీవ్రగాయాలయ్యాయి.రెండో కారు కూడా జూలిక కారు వెనుకే ఉండటంతో అది కూడా పల్టీలు కొట్టింది.

దీనిలో ప్రయాణిస్తున్న నేతా సింగ్, సలీనా సింగ్‌కు గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను బ్లూమింగ్టన్ ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కును ఓ కెనడియన్ నడుపుతున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

అయితే అదే కారులో ప్రయాణిస్తున్న రామరిన్ సింగ్ (48), సంగీతా సింగ్ 27, సలీమా సలీమ్ 45‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా మరో ఆసుపత్రికి తరలించారు.

ఐదుసార్లు ఫెయిల్.. ఆరో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్.. లఖన్ సింగ్ సక్సెస్ కు మెచ్చుకోవాల్సిందే!