జర్మనీలోని బెర్గెడార్ప్లోని బెజిర్క్( Bezirk In Bergedorp, Germany ) (జిల్లా) ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పంజాబీ నేత బరిలో దిగారు.
56 ఏళ్ల పర్మోద్ కుమార్( Parmod Kumar ) (56) క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సీడీయూ) నుంచి పోటీ చేస్తున్నారు.
1.7 లక్షల జనాభా కలిగిన బెర్గెడార్ప్ జిల్లాలో ఆయన తన ప్రచారానికి ప్రతిరోజూ 10-12 గంటలు కేటాయిస్తున్నాడు.
ఇందులో 5 వేల మంది భారతీయులు, ఆఫ్ఘన్, పాకిస్తానీలు ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.
జూన్ 9న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.ఈ సందర్భంగా పర్మోద్ మాట్లాడుతూ .
తాను భారత ప్రభుత్వంతో మెరుగైన సంబంధాలను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు.వ్యాపార సంబంధాలు, సాంస్కృతిక మార్పిడి, జర్మనీలో భారతీయ విద్యార్ధులకు మద్ధతు ఇస్తానని పర్మోద్ పేర్కొన్నారు.
స్థానికులకు మెరుగైన రవాణా , మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ, ఉద్యోగాల కల్పన వంటి సమస్యలను పర్మోద్ లేవనెత్తారు.
బెర్గెడార్ప్లో చదువుకోవడానికి ఎంతోమంది భారతీయ విద్యార్ధులు వస్తున్నారని, కానీ ఇక్కడ వారు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
"""/" /
ప్రభుత్వ ప్రతినిధిగా తాను ఈ సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నానని పర్మోద్ వెల్లడించారు.
వసతి సమస్యలను పరిష్కరించి, విద్యార్ధులకు సరసమైన గృహాలను పొందేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.
భారతీయులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడంలో, వారికి అవసరమైన వనరులు అందించడంలో మార్గనిర్దేశం చేస్తానని పర్మోద్ పేర్కొన్నారు.
అమృత్సర్లో( Amritsar ) జన్మించిన పర్మోద్ కుటుంబానికి బాల్ బేరింగ్ ఫ్యాక్టరీ ఉంది.
1991లో ఆయన జర్మనీకి వెళ్లారు.డిష్వాషర్గా వృత్తిని ప్రారంభించిన ఆయన అక్కడ వ్యాపారవేత్తగా ఎదిగి 120 మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు.
"""/" /
ఇదిలావుండగా.ఇటీవలి కాలంలో భారతీయులు జర్మనీకి కూడా బాగా దగ్గరవుతున్నారు.
ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు ఐటీ ఇతర రంగాలు జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్నాయి.అలాగే ఇక్కడ ప్రపంచస్థాయి యూనివర్సిటీలు నెలకొని వున్నాయి.
దీంతో మన విద్యార్ధులు ఈ యూరోపియన్ కంట్రీ వైపు కూడా బాగానే ఆకర్షితులవుతున్నారు.
పోలీస్ స్టేషన్ లో సైలెంట్.. ఇన్ స్టాగ్రామ్ లో అలాంటి పోస్ట్.. విష్ణుప్రియ ఏం చెప్పారంటే?