ఏడుగురు శిశువులను చంపేసిన కిరాతకురాలు.. ఆమెను పట్టించిన ఎన్నారై డాక్టర్…

ఏడుగురు శిశువులను చంపి, మరో 6 మందిని చంపడానికి ప్రయత్నించిందో బ్రిటీష్ నర్సు.

( British Nurse ) ఈమె చేసిన నేరాలకు రుజువులను అందిస్తూ ఆమెను దోషిగా నిర్ధారించడంలో ఒక ఎన్నారై వైద్యుడు( Nri Doctor ) సహాయం చేశారు.

యూకేలో జన్మించిన ఈ భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వల్ల చాలామంది పిల్లలు చావు నుంచి తప్పించుకోగలిగారు.

హంతకురాలిగా తేలిన లూసీ లెట్బీ ( Lucy Letby ) అనే నర్సు ఇంగ్లాండ్‌లోని చెస్టర్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లో పనిచేసింది.

"""/" / అనేక మంది శిశువులు( Babies ) చనిపోవడం లేదా కుప్పకూలడంతో తాను, ఇతర వైద్యులు ఎంతో ఆందోళన చెందినట్లు ఎన్నారై పీడియాట్రీషియన్ డాక్టర్ రవి జయరామ్( Dr.

Ravi Jayaram ) తెలిపారు.లెట్బీ ఈ దారుణాలకు పాల్పడుతుందని వారు హాస్పటల్ యాజమాన్యం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, డాక్టర్లు ఈ విషయమై ఒక పోలీసు అధికారికి ఫిర్యాదు చేసేందుకు అనుమతి ఇవ్వడానికి యాజమాన్యం ఏకంగా రెండేళ్ల సమయం తీసుకుంది.

ఆ తర్వాత దర్యాప్తును పోలీసు అధికారులు చేపట్టారు.2018లో లెట్బీని అరెస్టు చేశారు.

ఆమె 2023లో హత్య, హత్యాయత్నానికి పాల్పడినట్లు తేలింది. """/" / పిల్లలపై దాడి చేయడానికి లెట్బీ గాలి, ఇన్సులిన్‌తో ఇంజెక్ట్ చేయడం, వారికి పాలు లేదా ద్రవాలను బలవంతంగా తినిపించడం వంటి అనేక పద్ధతులను ఉపయోగించినట్లు కోర్టు గుర్తించింది.

ఆమె కొంతమంది శిశువులకు ఇంపాక్ట్-టైప్ ట్రామా కూడా కలిగించింది.లెట్బీ చేతితో రాసిన నోట్స్‌ను కూడా పోలీస్ టీమ్‌ కోర్టులో సమర్పించింది.

ఈ నోట్స్‌లో ఆమె తన చర్యల గురించి తెలుసుకుని, వాటి పట్ల అపరాధ భావంతో ఉన్నట్లు పేర్కొంది.

హత్యాయత్నానికి సంబంధించి మరో ఆరు ఆరోపణలపై జ్యూరీ తీర్పులు ఇవ్వలేకపోయింది.ఏది ఏమైనా ఈ కిరాతక నర్సుకు సోమవారం శిక్ష ఖరారు చేయనున్నారు.

వారికి వైసీపీలోకి రీ ఎంట్రీ లేనట్టేనా ?