మాల్‌లో మహిళను అసభ్యంగా తాకుతూ: దుబాయ్‌లో భారతీయుడిపై కేసు

మహిళను వేధించిన కేసులో దుబాయ్‌లో భారతీయుడిపై కేసు నమోదయ్యింది.వివరాల్లోకి వెళితే.

సిరియాకు చెందిన 35 ఏళ్ల మహిళ తాను ఆగస్టు నెలలో డ్రాగన్ మార్ట్‌లో ఉన్నానని.

ఆ సమయంలో నిందితుడు తనను అనుసరించాడని ఫిర్యాదులో పేర్కొంది.తన పిల్లల కోసం కొన్ని బొమ్మలు కొంటున్నానని.

అదే సమయంలో అతను తనను భయపెట్టేలా ప్రవర్తించాడని తెలిపింది.నా వెనుక నిలబడి అసభ్యకరంగా తన శరీరాన్ని తడుముతూ ఉన్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

బాధితురాలు ఓపికగా భరించినప్పటకీ.నిందితుడు మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు.

"""/"/ దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో మాల్‌లో ఉన్న జనం పరిగెత్తుకొచ్చి ఆకతాయిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో తాను ఆమెను అసభ్యకరంగా తాకానని అంగీకరించాడు.ఈ క్రమంలో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరం కింద భారతీయుడిపై అభియోగాలు మోపింది.

దీనిపై కోర్టు త్వరలోనే శిక్షను విధించనుంది.

వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది అంటూ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు..!!