హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త విదేశాంగ మంత్రి

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు.ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌లపై అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు పాస్ పోర్ట్ కార్యాల‌యం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ నేప‌థ్యంలో కార్యాల‌యం సిబ్బందితో గ్రూప్ ఫొటో దిగారు.ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు మ‌రింత కృషి చేయాల‌ని సిబ్బందికి పిలుపునిచ్చారు.

వేసవిలో సపోటాను ఇలా తీసుకున్నారంటే మీ బాడీలో వేడి మొత్తం ఆవిరైపోతుంది!