సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్
TeluguStop.com
షేక్ రషీద్ను అభినందించిన సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ.
10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్థలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హమీ ఇచ్చిన సీఎం.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేత.
షేక్ రషీద్ స్వస్థలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తూ క్రికెట్ లవర్స్ను ఆకట్టుకుంటున్న 17 ఏళ్ళ రషీద్ టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలోనూ, అండర్ 19 ప్రపంచకప్ను ఐదోసారి గెలవడంలోనూ కీలకపాత్ర పోషించిన రషీద్.
హాజరైన హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్ తండ్రి బాలీషా, ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు.
షేక్ రషీద్కు గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, ఈ మేరకు ఉత్తర్వులు జారీ.
అమెరికాను కాదని ఇండియాలో పిల్లల్ని పెంచుతున్న మహిళ.. ఆమె చెప్పిన 8 కారణాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!