మహిళల అండర్ -19 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్

టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ కు భారత్ మహిళల అండర్ -19 టీమ్ చేరుకుంది.

తాజాగా సెమీస్ లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.

108 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే భారత్ ఛేదించింది.

ఈ మ్యాచ్ లో కివీస్ స్కోర్ 107/9 కాగా భారత్ 110/2 తో గెలుపొందింది.

61 పరుగులతో శ్వేతా సెహ్రావత్ రాణించారు.