భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్ ఆఫ్‎లైన్ టికెట్ల అమ్మకాల్లో తిరకాసు

భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ ఆఫ్‎లైన్ టికెట్ల విక్రయాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెలిక పెట్టింది.

ఈరోజు జారీ చేసే ఆఫ్ లైన్ టికెట్లకు ఆధార్ ప్రూఫ్ తప్పనిసరి అని తెలిపింది.

దీంతో హెచ్‎సీఏ తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.సాయంత్రం 5 గంటల వరకు ఈ టికెట్ల అమ్మకాలు కొనసాగనున్నాయి.

ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే జింఖాన గ్రౌండ్స్ వద్ద అభిమానులు బారులు తీరారు.

బాయ్‌ఫ్రెండ్‌కి పదే పదే కాల్ చేస్తున్నారా.. అయితే మీకు ఈ సమస్య ఉండొచ్చు..?