వ్యవసాయ కళాశాల,సిరిసిల్ల నూతన భవన ప్రారంభోత్సవం… అతిథులు వీరే

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల సిరిసిల్ల, నూతన కళాశాల భవనం, బాలుర,బాలికల వసతి గృహల ప్రారంభోత్సవ కార్యక్రమం తేది 12.

04-2023 నాడు రాష్ట్ర సమాచార, పురపాలక, పట్టణాభివృద్ధి మరియు పారిశ్రామిక శాఖల మంత్రి.

కె.తారక రామారావు చేతుల మీదగ జరగనున్నది.

ఈ ప్రత్యేక కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, నిరంజన్ రెడ్డి , రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ యొక్క వైస్ చైరమన్ బోయినపల్లి వినోద్ కుమార్ , వ్యవసాయశాఖ కార్యదర్శి, యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ రఘునందన్ రావు గారు, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , రిజిస్టార్ డాక్టర్ సుధీర్ కుమార్ , యూనివర్సిటీ డీన్ డాక్టర్ సీమ , ఇతర జిల్లా, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కానున్నారని, వ్యవసాయ కళాశాల అసోషియేట్ డీన్, డా॥ టి.

ఉమామహేశ్వరి తెలిపారు .ఈ అన్ని వసతులతో కూడిన నుాతన కళాశాల భవనం, బాలుర, బాలికల వసతి గృహలు, వ్యవసాయ క్షేత్రం .

కె.తారక రామారావు గారి చేతుల మీదగా ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

దొంగతనానికి వచ్చాడు.. బుక్ కనిపించడంతో అది చదువుతూ చోరీ గురించే మర్చిపోయాడు..?