తెలంగాణ రైతాంగంపై కేంద్రం కక్షగట్టి వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు.
ఎంఎస్ పీ నిర్ణయించిన ధరకే కొనుగోలుకై నామా డిమాండ్ చేశారు.అటు వడ్ల కొనుగోలుపై కేంద్రం దిగిరాకుంటే ఉద్యమం తప్పదన్న ఎంపీ కేశవరావు.
టీఆర్ఎస్కు పోరాటాలు కొత్తకాదన్నారు.అటు దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన హోర్డింగులు ఆసక్తి రేపుతున్నాయి.
ఒకే దేశం, ఒకే ధాన్యం సేకరణ నినాదం ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి.తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపటమేగాక రైతాంగం పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ హోర్డింగులు వెలిశాయి.
ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని నిలదీసేలా హోర్డింగులు అప్పడే విస్తృతమై చర్చకు తెరలేపాయి.సిల్లీ రాజకీయాల కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు .
పరిపాలన చేతకాకే.కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కమీషన్ల కోసం కక్కుర్తి తప్ప.మరొకటి లేదని ఆరోపించారు.
మహిళలను టీఆర్ఎస్ అగౌరవపరుస్తోందన్నారు బండి సంజయ్.రైతులను మోసం చేసి దీక్షలు చేస్తారా అంటూ మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఆర్వింద్.