ప్రవళిక మృతిపై తెలంగాణ గవర్నర్ కీలక ఆదేశాలు

గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక మృతిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు.

ఆమె మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన గవర్నర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీతో పాటు టీఎస్పీఎస్సీ కార్యదర్శిని ఆదేశించారు.

అయితే వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక గ్రూప్ -2 పరీక్షలకు రెడీ అవుతోంది.

ఈ క్రమంలోనే అశోక్ నగర్ లోని హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

అయితే పరీక్ష వాయిదా పడటం వలనే మనస్తాపానికి గురై ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆమె స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం