ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల కీలక భేటీ..!!

ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు కీలక భేటీ నిర్వహించారని తెలుస్తోంది.ఈ మేరకు ఒంగోలులోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది.

మంత్రి మేరుగ నాగార్జున, కరణం వెంకటేశ్ తో మాజీమంత్రి బాలినేని నిర్వహించిన సమావేశం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ భేటీ వెనుకాల కారణాలను నాయకులు బయటపెట్టలేదు.అయితే గత కొంతకాలంగా ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేశ్ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇటు ఆమంచి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలు లేకుండానే బాలినేని అనుచరులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం.

ఆమంచి పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ గా ఉంటే కలిసి పని చేయలేమని బాలినేని అనుచర వర్గం చెబుతోంది.

ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలు సమావేశం కావడం జిల్లాలో ఆసక్తిని పెంచింది.

చిరంజీవి నెక్స్ట్ ఈ దర్శకులతోనే సినిమాలు చేయనున్నారా..?