హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం

హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్, సహా ఇంఛార్జ్ సునీల్ బన్సల్ హాజరయ్యారు.

ఇందులో పలువురు పార్టీ సీనియర్ నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.

పని విభజనపై నేతల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారని సమాచారం.దాంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇది మొదటి సమావేశమని సమాచారం.

ఏడాదికో సినిమాతో తారక్ అదిరిపోయే ప్లానింగ్.. ఈ హీరో ప్లానింగ్ అద్భుతం అంటూ?