అమరావతిలో బసవతారకం హాస్పిటల్ ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన..!!

బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్( Basavatharakam Hospital ) ఏపీలో కూడా స్థాపించబోతున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలియజేశారు.

ఈ హాస్పిటల్ కి మేనేజింగ్ ట్రస్ట్ అండ్ చైర్మన్ గా బాలకృష్ణ( Balakrishna ) ఉండటం తెలిసిందే.

హైదరాబాద్ లో ఉన్న ఈ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా విలువైన వైద్యం అందిస్తున్నారు.

కాగా ఇప్పుడు ఈ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటన చేయడం జరిగింది.

అమరావతిలో బసవతారకం హాస్పిటల్ నిర్మించేందుకు గతంలోనే సీఎం చంద్రబాబు స్థలాన్ని కేటాయించినట్లు స్పష్టం చేశారు.

ఇప్పుడు ఆ స్థలంలోనే క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. """/" / ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఏపీ నుంచి హైదరాబాద్ కి వచ్చే రోగులకు ఉపశమనం కలుగుతుంది అని తెలియజేయడం జరిగింది.

ఈ విషయాన్ని తాజాగా క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవంలో బాలకృష్ణ తెలియజేయడం జరిగింది.క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సంభందించి దేశంలోనే ఈ హాస్పిటల్ కి మంచి పేరు ఉంది.

ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మందికి పైగా క్యాన్సర్ పేషెంట్లు ఉచితంగా వైద్య చికిత్సలు( Free Medical Treatments ) అందుకోవడం జరిగింది.

బాలకృష్ణ తల్లి బసవతారకం క్యాన్సర్ తో చనిపోవడం.అప్పటి రోజులలో క్యాన్సర్ చికిత్స అందుబాటులో  లేకపోవడంతో తన తల్లిలా మరొకరికి జరగకూడదని ప్రజల కోసం ఆలోచించి బాలకృష్ణ ఈ హాస్పిటల్ నిర్మించారు.

ఇన్నాళ్లు హైదరాబాద్ లోనే సేవలు అందించిన ఈ హాస్పిటల్ ఇప్పుడు ఏపీలో కూడా.

ప్రారంభం కాబోతోంది.

మంత్రి గారి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు వార్నింగ్