నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు... ఫోటోగ్రాఫర్ల తీరుపై స్పందించిన తాప్సీ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన దొబెరా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ విడుదలకు సిద్ధం కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తాప్సీకి కెమెరామెన్ లకు మధ్య గొడవ తలెత్తిన విషయం మనకు తెలిసిందే.

తాప్సీ కోసం కొన్ని గంటలపాటు ఫోటోగ్రాఫర్లు ఎదురు చూసామని అలాంటి తమకు కాస్త సమయం కేటాయించండి అంటూ గట్టిగా తనపై అరవడంతో ఆమె సహనం కోల్పోయి మర్యాదగా మాట్లాడండి మీరు నాకు మర్యాద ఇస్తే నేను మీకు మర్యాద ఇస్తాను అంటూ కెమెరామెన్ లపై విరుచుకు పడిన విషయం మనకు తెలిసిందే.

గత రెండు రోజుల క్రితం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ గొడవపై తాప్సీ స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఉద్దేశపూర్వకంగానే ఎవరితో గొడవకు దిగలేదని తెలిపారు.

"""/"/ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు తనతో అసంభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనపై గట్టిగటిగా అరుస్తున్నారు.

అలా అరవడం నాకు నచ్చలేదని ఈమె తెలిపారు.ఇంట్లో వాళ్ళు కూడా నాపై గట్టిగా అరవరు అలాంటిది ఫోటోగ్రాఫర్స్ అరవడం నాకు నచ్చలేదని తెలిపారు.

ఇక కెమెరామెన్లు నాపై గట్టిగా అరుస్తున్నప్పటికీ నవ్వుతూనే మాట్లాడుతున్నానని ఇక సహనం కోల్పోయి చివరికి చేతులు జోడించినట్లు తెలిపారు.

నటీనటులు మూర్ఖులు కాదని కారణం లేకుండానే సహనం కోల్పోవడానికి వాళ్ళు ఏమి చదువుకోని వారు కాదు అంటూ ఈమె కామెంట్ చేశారు.

తాను పబ్లిక్ ఫిగర్ మాత్రమే పబ్లిక్ ప్రాపర్టీ కాదు అంటూ ఫోటోగ్రాఫర్లతో గొడవ గురించి ఈ సందర్భంగా ఈమె క్లారిటీ ఇచ్చారు.

సరిపోదా శనివారంలో నానినే డామినేట్ చేసిన ఎస్జే సూర్య.. సౌత్ లో బెస్ట్ నటుడంటూ?