కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు – మాజీ జెడ్పిటిసి మల్లు గారి నర్సయ్య గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక అలంగిర్ మస్జిద్ లొ మల్లు గారి నర్సయ్య గౌడ్(మాజి జడ్పీటీసీ )గత 30 సంవత్సరాల నుండి ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు .

మల్లు గారి నర్సయ్య గౌడ్, 1991 నుండి కరోనా రెండు సంవత్సరాలు మినహా, ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం రోజున ముస్లింలకు ఇఫ్తార్ విందును అల్లా దయతో పార్టీలకతీతంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు.

పవిత్ర రంజాన్ ఉపవాసంలో ఉన్న ముస్లిం సోదరులకు, కర్బూజా పనులు తినిపియడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇందు ముస్లింలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మండల ముస్లిం సోదరులు మండల ప్రజలు పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

వీడియో: గుండెపోటుతో మరొకరు మృతి.. కార్డియో చేస్తూ కుప్పకూలాడు..